మరోసారి గవర్నర్ ను కలిసిన విజయ్.. అపాయింట్ మెంట్ కోరిన పళనిస్వామి
- తమిళ రాజకీయాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ
- టీవీకేకు మద్దతు పలికిన కాంగ్రెస్
- ఈ మధ్యాహ్నం గవర్నర్ ను పళనిస్వామి కలిసే అవకాశం
తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే అధినేత విజయ్, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను కలిసి తమకున్న బలాన్ని వివరించారు. 5 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే విజయ్కు బేషరతుగా మద్దతు ప్రకటించింది.
అయితే, విజయ్ రెండు నియోజకవర్గాల్లో విజయం సాధించి ఒక స్థానానికి రాజీనామా చేయడంతో, టీవీకే మరియు కాంగ్రెస్ కలిపినా మొత్తం బలం 112 వద్దే ఆగిపోయింది. మేజిక్ ఫిగర్ 118కి చేరుకోవడానికి ఇంకా ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం కావడంతో, గవర్నర్ ప్రస్తుతానికి వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు.
మరోవైపు అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి కూడా గవర్నర్ అపాయింట్ మెంట్ కోరారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన గవర్నర్ ను కలిసే అవకాశం ఉంది.